కరీంనగర్ జిల్లా( Karimnagar ) మానకొండూరులో ఎలుగుబంటి సంచారం తీవ్ర కలకలం సృష్టించింది.స్థానికంగా ఉన్న చెట్టుపైకి ఎక్కిన ఎలుగుబండి( Bear ) సుమారు ఏడు గంటలుగా చెట్టుపైనే కూర్చుని ఉంది.
దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు.

తరువాత అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.అయితే ఇవాళ ఉదయం మానకొండూరులోని హనుమాన్ ఆలయం( Hanuman Temple ) సమీపంలోని ఓ ఇంటిలోకి ఎలుగుబండి ప్రవేశించింది.అక్కడ కొన్ని కుక్కలు తరమడంతో చెట్టు ఎక్కిందని తెలుస్తోంది.వరంగల్ నుంచి రానున్న రెస్క్యూ టీమ్ ఎలుగును బంధించనుంది.







