తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( Telangana CM Revanth Reddy )పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్( KCR ) పై అసభ్య పదజాలం ప్రయోగించిన సీఎం రేవంత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.ఒకవేళ పోలీసులు రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయకపోతే కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పాలన.రాచరిక వ్యవస్థను తలపిస్తోందని ఆమె ఆరోపించారు.అలాగే బీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్( Balka Suman ) పై కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని కవిత వెల్లడించారు.







