రైలు వస్తున్నా పట్టాలు దాటుతూ ప్రమాదాలకు గురై చనిపోతున్న ఘటనలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి.పోలీసులు ఎంత జాగ్రత్తలు చెప్పినా ప్రజల్లో మార్పు కలగడం లేదు.
కొందరు ఇలాంటి వ్యక్తులకు అవగాహన కల్పించాలని ఉద్దేశంతో సొంతంగా యాడ్స్ చేస్తున్నారు తాజాగా అలాంటి ఒక యాడ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీనిని @ githii ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి తన కూతురితో కలిసి రైల్వే ట్రాక్( Railway track ) దాటుతుండడం మనం చూడవచ్చు.
అయితే పట్టాలు సగం దాటగానే బైక్ ఆగిపోయింది.మరోవైపు అదే పట్టాలపై ఒక రైలు దూసుకు వస్తోంది.
తరువాత బైక్ పై ఉన్న వ్యక్తి తన కూతురితో సహా కింద పడిపోయాడు.అప్పటికీ బండిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో దానిని పైకి లేపడానికి బాగా ట్రై చేశాడు కానీ పట్టాలలో ఫుట్ రెస్ట్ పెగ్ ఇరుక్కుంది.
అందువల్ల అది లేవలేదు.
దాంతో పిల్ల ప్రాణాలను కాపాడాలని ఆమెను రైలు పట్టాలికి అవతల వైపు ఉంచాడు.తర్వాత మళ్లీ బైకు లేపేందుకు ప్రయత్నించాడు.ఇది చూసిన లోకో పైలట్( Pilot ) హారన్ కొడుతూనే ఉన్నాడు.
అయినా అతడు పట్టాల పైనుంచి లేవకుండా బైక్ ని పట్టాలు దాటించేందుకు విఫల యత్నం చేశాడు.చివరికి బండిని పట్టాల పైనుంచి పక్కకు తీయగలిగాడు.కానీ అటువైపు ఉన్న తన తండ్రి వద్దకు వెళ్లేందుకు అతడి కూతురు ట్రైన్ పట్టాలు దాటడం ప్రారంభించింది.
లోకోపై లైట్ ట్రైన్ స్లో చేశాడు కానీ చిన్నారి రైలు( Train accident ) పట్టాల మధ్యలో పడిపోయింది.20 కిలోమీటర్ల స్పీడులో ఆ ట్రైన్ వచ్చి చిన్నారిని చిదిమేసింది.చివరికి ఆగింది కానీ ఆ బాలిక శరీరం చిద్రమై రక్తం ఏరులై పారింది.
దాంతో ఆ తండ్రి ఎంతో కన్నీరు మున్నీరయ్యాడు.మళ్లీ కొన్ని నెలల తర్వాత అతడు ఆ రైలు పట్టాలను బైక్ పై దాటడానికి వచ్చాడు.
అప్పుడు అతనికి కూతురి ఆత్మ ఆకాశంలో కనిపించి ఆగమని చెప్పింది.తండ్రి తన తప్పు తెలుసుకుని ఆగిపోయాడు.
తన కూతురు వైపు చూస్తున్నాడు.యాడ్ చివరిలో జీవితం ఎంతో విలువైనది, మీ కుటుంబం మీ కోసం వెయిట్ చేస్తుంటుంది, ప్రాణాలను రిస్క్ లో పెట్టకండి అని ఒక మెసేజ్ ఇచ్చారు.
ఈ వీడియో చూసి చాలా మంది ఎమోషనల్ అవుతున్నారు.చాలా ఎమోషనల్ గా ఈ మెసేజ్ ఇచ్చారని పొగుడుతున్నారు.