ఆ పరీక్ష పాస్ అయిన బంగార్రాజు.. ఇక దూకుడే!

నాగార్జున మరియు నాగ చైతన్యల బంగార్రాజు సినిమా బ్రేక్‌ ఈవెన్‌ కు కొద్ది దూరంలో నిలిచింది.

ఈ సినిమా మొదటి నాలుగు రోజులు మంచి వసూళ్లను దక్కించుకుంది.

కనుక ముందు ముందు కూడా ఈ సినిమా భారీగా వసూళ్లు దక్కించుకుంటుందని అంతా భావిస్తున్న సమయంలో అనూహ్యంగా ఈ సినిమా కు సంబంధించిన వసూళ్లు డౌన్ అయ్యేలా ఏపీ లో కరోనా కారణంగా కర్ఫ్యూ మరియు థియేటర్ల వద్ద ఆంక్షలను అమలు చేస్తున్నట్లుగా ప్రకటించారు.దాంతో బంగార్రాజు ఏపీలో ఇక వసూళ్లు దక్కించుకోవడం సాధ్యం కాకపోవచ్చు అనే అభిప్రాయంకు అంతా వచ్చారు.

కాని అనూహ్యంగా కర్ఫ్యూ ఉన్నా కూడా ఏపీ లో మంచి షేర్ ను రాబట్టింది.కోటి కి పైగా షేర్ ను రాబట్టడంతో ఖచ్చితంగా మరో వారం పది రోజుల పాటు కుమ్మేయడం ఖాయం అనిపిస్తుంది.50 శాతం ఆక్యుపెన్సీ ఉన్నా కూడా ఈ సినిమాను భారీ ఎత్తున చూసేందుకు జనాలు సిద్దం అవుతున్నారని తాజాగా వచ్చిన షేర్‌ తో క్లారిటీ వచ్చింది.

ప్రస్తుతం తెలంగాణ లో కూడా సినిమా భారీగా వసూళ్లు రాబడుతుంది.కనుక ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ సాధించడం మాత్రమే కాకుండా భారీ వసూళ్లు నమోదు చేస్తుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.మొదటి వారం రోజులు పూర్తి అయ్యేప్పటికి ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ ను సాధించి ఆ తర్వాత నుండి లాభాలను దక్కించుకోవడం ఖాయం అంటూ ట్రేడ్‌ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

 ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి ఈ సినిమా లో చైతూకు జోడీగా నటించడం వల్ల సినిమా స్థాయి మరింత పెరిగింది అనడంలో సందేహం లేదు.ఇక రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించింది.

అంతే కాకుండా ఈ సినిమా లో జాతి రత్నాలు హీరోయిన్ కూడా కనిపించింది.మీనాక్షి దీక్షిత్‌ తో పాటు పలువురు ముద్దుగుమ్మలు ఈ సినిమాలో కనిపించారు.

Advertisement

తాజా వార్తలు