మాజీ మంత్రి మల్లారెడ్డి( Former Minister Malla Reddy ) తీరుపై సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్ హాట్ కామెంట్స్ చేశారు.మల్లారెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
మల్లారెడ్డి విద్యార్థుల రక్తాన్ని పీల్చి ఫీజులు వసూలు చేస్తున్నారని బండ్ల గణేశ్ ఆరోపించారు.మల్లారెడ్డి తమ పార్టీలోకి వస్తే తీసుకోమని తేల్చి చెప్పారు.
మల్లారెడ్డి డబ్బుందన్న అహంకారంతో మాట్లాడుతున్నారన్న బండ్ల గణేశ్( Bandla Ganesh ) ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం నేర్చుకోవాలని సూచించారు.

నోటికి వచ్చినట్లు మాట్లాడొద్దని తెలిపారు.సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) పరిపాలన చూసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా తాను గర్వపడుతున్నానని తెలిపారు.అయితే మల్కాజిగిరి లోక్ సభ టికెట్( Malkajgiri Lok Sabha Ticket ) కోసం గాంధీభవన్ లో బండ్ల గణేశ్ దరఖాస్తు చేసుకున్నారు.







