తెలంగాణలో పొత్తులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు.రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని చెప్పారు.
కమలాన్ని అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు బీఆర్ఎస్, కమ్యూనిస్ట్ పార్టీలతో పాటు కాంగ్రెస్, ఎంఐఎంలు ప్రయత్నిస్తున్నాయన్నారు.
ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణలో బీజేపీ అధికారంలో రావడం ఖాయమని తెలిపారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసే పోటీ చేస్తాయన్న ఆయన హస్తం నేతలే పొత్తులపై క్లారిటీ ఇచ్చారని వెల్లడించారు.బీజేపీకి ఏ పార్టీతో పొత్తు లేదని స్పష్టం చేశారు.
బీజేపీ సింహామన్న బండి సంజయ్ సింగిల్ గానే పోటీ చేస్తోందని తెలిపారు.