హైదరాబాద్ లో ఎంతో ప్రసిద్ది చెందిన శ్రీ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం జూన్ 20వ తేదీన నిర్వహించడం జరుగుతుందని మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సోమవారం సాయంత్రం తన నూతన సచివాలయంలోని చాంబర్ లో దేవాదాయ శాఖ అధికారులతో బల్కంపేట ఆలయ అభివృద్ధి, అమ్మవారి కల్యాణం నిర్వహణ పై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, ఆలయ EO అన్నపూర్ణ, ఆలయ చైర్మన్ సాయిబాబా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.