హీరో బాలకృష్ణ అభిమానులకు సంక్రాంతి బొనాంజా అందించనున్నారు.హీరో బాలయ్య నటించిన చిత్రం వీరసింహా రెడ్డి జనవరి 12న రిలీజ్ కానుంది.
ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.గాడ్ ఆఫ్ మాసెస్ రాకతో సంక్రాంతి మరింత మాస్ గా ఉంటుందంటూ అనౌన్స్ మెంట్ ఇచ్చింది.
కాగా ఈ చిత్రంలో బాలయ్య, శృతిహాసన్ జంటగా నటించగా దర్శకుడిగా మలినేని గోపిచంద్ ఉన్నారు.అయితే గోపిచంద్ తో డైరెక్షన్ లో బాలయ్య తొలి సినిమా వీరసింహా రెడ్డి కావడం విశేషం.