నందమూరి బాలకృష్ణ అంటే ఒక హీరో మాత్రమే అని గత ఏడాది వరకు ప్రేక్షకులు అనుకున్నారు.కానీ ఆయన టాక్ షో చేస్తే ఎలా ఉంటుందో చేసి చూపించారు.
ఆహా లో అన్ స్టాపబుల్ టాక్ షో కి మంచి స్పందన వచ్చింది.నిర్వాహకులు బాలయ్య టాక్స్ షో కి మంచి రెస్పాన్స్ దక్కడంతో స్పీడ్ పెంచారు.
గత సీజన్ లోని అన్ని ఎపిసోడ్స్ కూడా భారీ వ్యూస్ సొంతం చేసుకొని ఆ ఏడాదిలో టాప్ రేటెడ్ టాక్ షో గా నిలిచింది.అంతటి మంచి సక్సెస్ అయిన టాక్ షో రెండవ సీజన్ మరింత ఆకట్టుకునే విధంగా ఉంటే జనాలు చూస్తారు.
అంతే కాకుండా మరింత ఎంటర్టైన్మెంట్ ను అందించే ఎపిసోడ్స్ ని ప్రేక్షకులు ఆశించారు, కానీ ఆహా టీం వారు ప్రేక్షకులు ఆశించిన ఎంటర్టైన్మెంట్ ని అందించడంలో విఫలం అయ్యారు.బాలకృష్ణ కచ్చితంగా తన శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాడు.
కానీ ఆహా టీం వారు ఎంపిక చేస్తున్న గెస్టులు మరియు వారితో బాలయ్య యొక్క ముచ్చట్లు ఆకట్టుకునే విధంగా లేవు అంటూ విమర్శలు చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు.
ఈ సీజన్ లో మొదటి ఎపిసోడ్ లో నారా చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ లను తీసుకొచ్చారు.ఆ ఎపిసోడ్ మొత్తం భజన అన్నట్లుగా ఉంది అని విమర్శలు వచ్చాయి.ఆ తర్వాత ఎపిసోడ్ లో విశ్వక్సేన్ మరియు సిద్దు జొన్నలగడ్డ వచ్చారు.
అది కూడా అంతంత మాత్రమే ఉంది.ఇక ఆ తర్వాత శర్వానంద్ అడవి శేషు వచ్చారు.
ఆ ఎపిసోడ్ కాస్త పరవాలేదు అన్నట్లు నిలిచినా ఆ తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డి, రాధిక ఎపిసోడ్ పెద్దగా ఆకట్టుకోలేదు.ఇక తాజాగా అల్లు అరవింద్, సురేష్ బాబు, రాఘవేంద్రరావు వంటి టాలీవుడ్ లెజెండ్స్ తో ఎపిసోడ్ వచ్చింది.
ఈ ఎపిసోడ్ కూడా పెద్దగా ఆకట్టుకునే విధంగా లేదు అంటూ విమర్శలు వస్తున్నాయి.దాంతో ఇప్పటికే ఈ షో పై ఆసక్తి తగ్గిందని ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు.
రెండవ సీజన్ కే బోర్ కొట్టేలా చేశారు అనే విమర్శలు చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు.అయితే వచ్చే ఎపిసోడ్ లో ప్రభాస్ మరియు గోపీచంద్ రాబోతున్న కారణంగా మళ్లీ ఏమైనా ఈ షో జోరు పెరుగుతుందా అనేది చూడాలి.