నర్సులను అవమానించారని తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నందమూరి బాలకృష్ణ ఖండించారు.నర్సులను కించపరిచానని తన మాటలను కావాలనే వక్రీకరించారన్నారు.
బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో నర్సుల సేవలను ప్రత్యక్షంగా చూశానని బాలయ్య తెలిపారు.రోగులకు సేవలు చేసి ప్రాణాలు కాపాడే నర్సులంటే తనకెంతో గౌరవమని చెప్పారు.
నర్సులకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనని కొనియాడారు.