బాలయ్య బోయపాటిల చిత్రం కథ ఇదేనా?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దర్శకుడు బోయపాటి, ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.గతంలో ఆయన తీసిన ‘వినయ విధేయ రామ’ దారుణమైన ఫెయిల్యూర్‌గా మిగలడంతో, ఈసారి ఎలాగైనా బౌన్స్ బ్యాక్ కావాలని చూస్తున్నాడు.

ఈ క్రమంలోనే బాలయ్య కోసం అదిరిపోయే పవర్‌ఫుల్ కథను బోయపాటి రెడీ చేసినట్లు తెలుస్తోంది.ఈ కథ పూర్తిగా రివెంజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో బాలయ్య తమ్ముడిగా యంగ్ హీరో నవీన్ చంద్ర కనిపిస్తాడని, అతడని విలన్‌లు చంపేయడంతో వారిపై బాలయ్య ఎలా పగ తీర్చుకున్నాడనేది ఈ సినిమా కథ అని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.రొటీన్ స్టోరీలైన్ అయినప్పటికీ, ఈ సినిమాను బోయపాటి తనదైన శైలిలో తెరకెక్కిస్తున్నాడని, అది ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్ర వర్గాల టాక్.

Advertisement

ఇక ఈ సినిమాలో బాలయ్య చెప్పబోయే డైలాగులకు థియేటర్లలో విజిల్స్ పడటం ఖాయమట.కాగా ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

అందులో అఘోరా పాత్ర కూడా ఉంటుందని, అది సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని చిత్ర వర్గాల టాక్.ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన ఓ కొత్త బ్యూటీని హీరోయిన్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

కానీ ఆమె ఎవరనే విషయాన్ని ఇప్పటివరకు చిత్ర యూనిట్ అనౌన్స్ చేయకపోవడం గమనార్హం.ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ ముగించేసి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను.. సోనమ్ కపూర్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

Advertisement

తాజా వార్తలు