టిడిపి కి సవాల్ విసిరిన బైరెడ్డి సిద్దార్ధరెడ్డి

మళ్ళీ అధికారం లో రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటామని,వస్తే మీరు రాజకీయలనుంచి తప్పుకుంటారా అని ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ నాయకులకు సవాల్ నంద్యాల జిల్లా నందికొట్కూరు లో రాష్ట్ర యువ విభాగం అధ్యక్షుడు, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి వాసవీ మాత దర్శనం కోసం వచ్చి కొన్ని కీలక వ్యాఖ్యలు టీడీపీ నాయకులను ఉద్దేశించి చేశారు.వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలో రాకపోతే తాను రాజకీయాలనుండి శాశ్వతంగా తప్పుకుంటానని, టీడీపీ పార్టీ అధికారంలో రాకపోతే ఆ పార్టీ నాయకులు రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అంటూ సవాల్ విసిరారు.

 Baireddy Siddharth Reddy Challenged Tdp , Tdp , Baireddy Siddharth Reddy, Vasavi-TeluguStop.com

మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం పై ప్రజల విశ్వాసం తగ్గిందని, అసంతృప్తి ఉందని ప్రచారం చేస్తున్నవారు తన సవాల్ ను స్వీకరించాలన్నారు.ఓటర్లు తమ అభిప్రాయాలను రోజు వెల్లడించరని ఎన్నికల్లో తెలియచేస్తారన్నారు.

ప్రజల కు మంచి చేస్తున్న తమ ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు ఉంటాయన్నారు.జరగబోయే ఎన్నికలు నీతికి అవినీతికి జరిగే ఎన్నికలన్నారు.

వచ్చే ఎన్నికల్లో ప్రజలు టీడీపీ కి గట్టి బుద్ధి చెబుతారన్నారు.ఇకనైనా టీడీపీ నాయకులు డబ్బా మాటలు మాట్లాడటం మానుకోవాలని హితవుపలికారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube