తెలంగాణలో సంచలనంగా మారిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది.ఈ మేరకు పిటిషన్ పై విచారణ జరిపిన రాష్ట్ర హైకోర్టు ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, నంద కుమార్, సింహయాజిలకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.రూ.3 లక్షల చొప్పున రెండు పూచీకత్తు సమర్పించాలని న్యాయస్థానం పేర్కొంది.
అదేవిధంగా సిట్ దర్యాప్తునకు సహకరించాలని తెలిపింది.పాస్ పోర్టులు సిట్ అధికారులకు సమర్పించాలని, ముగ్గురు నిందితులు నగరం విడిచి ఎక్కడికీ వెళ్లరాదని కోర్టు వెల్లడించింది.ప్రతి సోమవారం సిట్ కార్యాలయంలో హాజరు కావాలని స్పష్టం చేసింది.