ఏపీలో త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీజేపీ( BJp ) ప్రచారంలో దూసుకెళ్తేందుకు రంగం సిద్ధం చేస్తోంది.ఇందులో భాగంగా బీజేపీ ప్రచార రథాలను రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రారంభించారు.
రాష్ట్రంలో పొత్తులపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుందని ఆమె తెలిపారు.దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసమే పొత్తులన్న పురంధేశ్వరి సీట్లపై త్వరలోనే క్లారిటీ వస్తుందని వెల్లడించారు.
కాగా ఏపీలో బీజేపీతో టీడీపీ -జనసేన పొత్తు ఖరారైన సంగతి తెలిసిందే.