ఏపీలో ఆరోగ్యశ్రీపై అవగాహన కార్యక్రమం

ఏపీలో ఆరోగ్యశ్రీపై అవగాహన కార్యక్రమం ప్రారంభమైంది.ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ప్రతి పేదవానికి ఆరోగ్యశ్రీని చేరువ చేయడమే లక్ష్యమని తెలిపారు.

 Awareness Program On Arogyashri In Ap-TeluguStop.com

ఈ క్రమంలోనే ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచామని సీఎం జగన్ వెల్లడించారు.వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్య శ్రీ కిందకు వచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు.అలాగే సుమారు 2,513 ఆస్పత్రులకు ఆరోగ్య శ్రీని విస్తరించామని తెలిపారు.వైద్యరంగంలో ఎప్పుడూ జరగని విధంగా నాడు -నేడు కార్యక్రమం ద్వారా విలేజ్ క్లినిక్ లు, పీహెచ్సీలు, సీహెచ్సీలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు అన్ని ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు అందిస్తున్నామని తెలిపారు.

వైద్యం కోసం పేదవారు అప్పులపాలు కాకుండా ఉండే విధంగా వైద్యరంగంలో ఆరోగ్య శ్రీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు.ఇందులో భాగంగా ఆరోగ్య శ్రీ పరిమితిని పెంచామని సీఎం జగన్ స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube