తిరుమల ఘాట్ రోడ్డులో చోటు చేసుకుంటున్న ప్రమాదాలపై ట్రాఫిక్ పోలీస్ అధికారులు అప్రమత్తం అయ్యారు.ఈ మేరకు ఘాట్ రోడ్డులో ఫిట్ నెస్ లేని వాహనాలపై ఆంక్షలు విధిస్తున్నారు.
డ్రైవర్ల నిర్లక్ష్యంతో పాటు అవగాహన లోపం కారణంగానే తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.ఈ క్రమంలో ప్రమాదాల నివారణ కోసం బ్లాక్ స్పాట్లు గుర్తించి తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
నిన్న జరిగిన టెంపో ట్రావెలర్ బోల్తా ఘటన అవగాహన లేకపోవడం వలనే జరిగిందని వెల్లడించారు.ఫిట్ నెస్ లేని వాహనాల్లో తిరుమలకు రావొద్దని, 15 ఏళ్లు పైబడిన వాహనాలను తీసుకురావద్దని భక్తులకు పోలీసులు సూచించారు.