చేనేతలపై ఎవరైనా దాడులకు పాల్పడితే ఊరుకునేది లేదు - పరిటాల శ్రీరామ్

చేనేతలపై ఎవరైనా దాడులకు పాల్పడితే ఊరుకునే పరిస్థితి లేదని ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ హెచ్చరించారు గత నెలలో విజయవాడ ఆలయ సిల్క్స్ యజమాని ధర్మవరం పట్టు వ్యాపారస్తులైన గిర్రాజు శశి, కోటం ఆనంద్ లపై దాడి పట్ల పరిటాల శ్రీరామ్ తీవ్రంగా స్పందించారు.ఇన్ని రోజులు అమెరికా పర్యటనలో ఉన్న కారణంగా శ్రీరామ్ బాధితులను కలుసుకోలేదు.

 Attacks On Handloom Weavers Will Not Be Tolerated Paritala Sriram, Handloom Wea-TeluguStop.com

అమెరికా నుంచి వచ్చిన తర్వాత బాధితుల వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు.ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా బాధితులకు ధైర్యం చెప్పారు.

ధర్మవరంలో చేనేత కార్మికులు మృదుస్వభావులుగా ఉంటారని, వారు ఎవరితోనూ గొడవలు పెట్టుకునే మనస్తత్వం కాదని శ్రీరామ్ అన్నారు.

ఇటీవల కరోనా సమయంలో వ్యాపార పరంగా తీవ్రంగా నష్టాలు మోస్తున్నారని.ఇలాంటి సమయంలో చీరలు తీసుకున్న వాటికి డబ్బు ఇవ్వకుండా వేధింపులు చేయడం సరైన చర్య కాదన్నారు.

విజయవాడలో ఏకంగా దాడులు చేశారని, ఇది చేనేత వ్యవస్థపై జరిగిన దాడిగా భావిస్తున్నట్లు తెలిపారు.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేతలపై దాడులు అరికట్టేందుకు ఒక కఠినమైన చట్టాన్ని తీసుకొస్తామని ఈ అంశం మీద చంద్రబాబు గారు, లోకేష్ గారితో మాట్లాడుతానని పరిటాల శ్రీరామ్ అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube