అమరావతి: సీఎం జగన్ ను కలిసి అనంతరం విక్రమ్ రెడ్డి కామెంట్స్.ప్రతి ఇంటికి జగనన్న అండగా నిలిచారు.
ప్రజల్లోకి సంక్షేమ పథకాలు వెళ్లాయి అనడానికి ఆత్మకూరు ఫలితాలే నిదర్శనం.ఆత్మకూరు ప్రచారం సందర్భంగా గడప గడపకి వెళ్లినపుడు స్పష్టంగా కనిపించింది.
అందుకే ఇంత పెద్ద మెజార్టీతో ప్రజలు ఆదరించారు.
నియోజకవర్గంలో చేయాల్సిన పనుల గురించి సీఎంతో చర్చించాను.
పారిశ్రామిక ప్రగతి పై దృష్టి పెడుతున్నానని,
నిరుద్యోగులకు ఉపాధి
కల్పించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.జులైలో అన్న గౌతమ్ రెడ్డి పేరుపై ఉన్న సంగం బ్యారేజినీ సీఎం ప్రారంభిస్తారు.