ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది.ఇందులో భాగంగా గుంటూరు జిల్లా( Guntur District ) పొన్నూరులో సీఎం జగన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబుకు ( Chandrababu ) ఓటేస్తే పథకాలకు ముగింపు పలికినట్లేనని సీఎం జగన్ తెలిపారు.విలువలు లేని చంద్రబాబు నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు.
ఈ మధ్య చంద్రబాబు తనను బచ్చా అంటున్నారన్న సీఎం జగన్ ఓడిపోయే కాలం వచ్చినప్పుడు విలన్లు అందరికీ హీరో బచ్చాలానే కనిపిస్తాడని చెప్పారు.తనను బచ్చా అంటున్న చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.
తనను బచ్చా అంటున్న చంద్రబాబుకు ఇన్ని పార్టీలతో పొత్తులు ఎందుకో చెప్పాలన్నారు.ఇంటింటికీ మంచి చేసి ఒంటరిగా నిలుచున్నాడు ఈ బచ్చా అని పేర్కొన్నారు.జగన్ ను తిట్టడమే చంద్రబాబు ప్రచారంగా పెట్టుకున్నారని విమర్శించారు.ఈ క్రమంలోనే చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పనైనా గుర్తుకు వస్తుందా అని ప్రశ్నించారు.58 నెలలు బచ్చా చేసిన పనులు 14 ఏళ్లు సీఎంగా ఉండి ఎందుకు చేయలేదన్నారు.మూడు సార్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఈ బచ్చాను చూసి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.