నల్లగొండ జిల్లా: తెలంగాణలో రాజీవ్ ఆరోగ్యశ్రీ లబ్ధి దారులకు కుటుంబాన్ని యూనిట్గా తీసుకుని యూనిక్ ఐడీతో ప్రభుత్వం కొత్త కార్డులు ఇవ్వనుంది.దీనినే హెల్త్ ప్రొఫైల్కు లింక్ చేసి, డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ తయారు చేయనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఏటా ఆరోగ్యశ్రీకి 1,100 కోట్లు ఖర్చవుతుండగా అదనంగా రూ.400 కోట్లు పెరగొచ్చని అంచనా.కాగా రేషన్ కార్డుతో సంబంధం లేకుండా అందరికీ ఆరోగ్య శ్రీ వర్తిస్తుందని సీఎం రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే.