ప్రస్తుత సమాజంలో దాదాపు చాలా మంది ప్రజలు కాలంతో పాటు పరిగెడుతు ఉన్నారు.నేటి యువతవి ఎప్పుడు ఉరుకులు, పరుగుల జీవితాలే అని కచ్చితంగా చెప్పవచ్చు.
అలాగే కాస్త సమయం దొరికితే రిలాక్స్ అవ్వడానికి చూస్తూ ఉంటారు.కానీ ఇలాంటి వారికి సమయమే ఉండదు.
దీనికి తోడు పని ఒత్తిడి కూడా ఉంటుంది.అందుకే చాలా మంది స్ట్రెస్ ఫీల్ అవుతూ, ఒక్కసారిగా డిప్రెషన్( Depression ) కి గురవుతూ ఉంటారు.
దీంతో మానసిక ప్రశాంతత లేకుండా ఉంటుంది.అలాగే స్ట్రెస్ కారణంగా ఏదో ఒక ఆరోగ్య సమస్య తలెత్తుతుంది.
అయితే వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ఇలా చేయమని వైద్య నిపుణులు చెబుతున్నారు.అలాగే ప్రతి రోజు రెగ్యులర్ పనులన్నీ పూర్తయ్యాక బాడీ ఎక్కువ గా అలసిపోయినా కానీ, టెన్షన్ వల్ల ఏదైనా రిలాక్స్ అవుదామని అనుకున్నా నిద్ర రాదు.ఇలాంటివి మనం రెగ్యులర్ గా గమనిస్తూ ఉంటాము.ఇలా అనిపించినప్పుడు ఏమీ ఆలోచించకుండా కేవలం నేల పై పడుకోవాలని నిపుణులు చెబుతున్నారు.అలాగే యోగ చేసే వారికే కాదు,యోగ చేయని వారికి తెలిసిన ఆసనం శవాసనం.అలాగే నేల మీద వెల్లకిలా పడుకుని కాళ్లు, చేతులను దూరంగా ఉంచడమే శవాసనం చేయడం ద్వారా కండరాల మధ్య ఉన్న ఒత్తిడి( Stress ) తొలగిపోతుంది.
అలాగే ఆందోళనలో ఉన్నప్పుడు ఇలా నేల పై పడుకోవడం ద్వారా అసంకల్పిత ప్రతీకార చర్యను శాసించే నాడులు ఉత్తేజం చెంది ఒత్తిడి హార్మోన్లను నియంత్రిస్తాయి.దీంతో మనసు కుదుటపడుతుందని నిపుణులు చెబుతున్నారు.నిత్యం యోగా ఆసనాలు( Yoga Asanas ), ధ్యానం లాంటివి చేసే వారికి ఇవన్నీ కొత్తవి ఏమి కాదని నిపుణులు చెబుతున్నారు.కానీ వీటిని క్రమం తప్పకుండా చేయని వారికి కూడా ఈ శవాసనం చాలా చక్కగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.