ఉద్యమిస్తేనే ఆంధ్రలో మనుగడ

ప్రస్తుతం కాంగ్రెసు పార్టీ ఎటువంటి దయనీయ స్థితిలో అందరికీ తెలుసు.తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వంపై విరుచుకుపడటానికి కొందరు ఎమ్మెల్యేలైనా ఉన్నారు.

 Apcc Decided To Take Up Agitational Programmes-TeluguStop.com

కాని ఆంధ్ర చట్ట సభలో ఒక్క సభ్యుడూ లేడు.దీంతో కాంగ్రెసు నాయకులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.

వారు ఓటమి నుంచి ఇంకా పూర్తిగా తేరుకోకపోయినా, నిరాశ నుంచి బయటపడకపోయినా కాలూ చేయీ ఆడించనిదే ప్రయోజనం లేదు.కేవలం మాటలతో ప్రభుత్వాన్ని విమర్శించడం కాకుండా కొంత కార్యాచరణ కూడా ఉండాలి.

అంటే కాంగ్రెసు నాయకులు, కార్యకర్తలు వీధుల్లోకొచ్చి ఉద్యమించాల్సిన అవసరం ఉంది.చట్ట సభలో స్థానంలేకపోయినా ప్రజల తరపున పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని తెలియచెప్పాల్సిన అవసరముంది.

దీనిపైనే నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు.బుర్రలకు పని చెబుతున్నారు.

కాంగ్రెసు పార్టీ ఉద్యమాలు చేయకపోతే పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి పదవికి ముప్పు వచ్చే అవకాశముంది.తెలంగాణలో పొన్నాలను పీకేసి ఉత్తమ్‌ కుమార్‌కు బాధ్యతలు అప్పగించిన సోనియా గాంధీ ఆంధ్రలో మాత్రం వేచిచూసే ధోరణితో ఉన్నారు.

రాష్ర్ట, కేంద్ర ప్రభుత్వాలపై పోరాటాలు చేయకపోతే ఆమె పదవి పీకుతారనే భయం పీసీసీ అధ్యక్షుడు రఘువీరాకు ఉంది కాబట్టి ఏక కాలంలో టీడీపీ, ఎన్‌డిఏ ప్రభుత్వాలపై పోరాటం చేయాలని పార్టీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ నిర్ణయించింది.ప్రధానంగా విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేదాకా పోరాటం చేయాలని కాంగ్రెసు ప్లాన్‌ చేస్తోంది.

మరి ఈ పోరాటంలో ఎంతవరకు విజయం సాధిస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube