ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలో ఉన్న గ్రేడ్ -1, 2 వీఆర్ఓలకు అండగా నిలిచేందుకు చర్యలు చేపట్టింది.
దీనిలో భాగంగా సర్వీసులో ఉ్న వీఆర్ఓలు మరణిస్తే.వారి కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకానికి అవకాశం కల్పించింది.
ఈ మేరకు నిబంధనల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.అదే విధంగా డిగ్రీ విద్యార్హత కలిగిన పిల్లలకు జూనియర్ అసిస్టెంట్, లేదా ఈ క్యాడర్ కు సమానమైన ఉద్యోగాల్లో అవకాశం కల్పించనున్నారు.
అయితే, గత కొన్ని సంవత్సరాలుగా కారుణ్య నియామకాల కోసం వీఆర్ఓలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వీఆర్ఓలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.