ఏపీలో సంక్షేమ పథకాలు అందని వారికి ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది.రాష్ట్ర వ్యాప్తంగా 2,79,065 మంది లబ్ధిదారులకు రూ.590.91 కోట్లను సర్కార్ జమ చేసింది.ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలని చెప్పారు.
పెన్షన్లపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు.అనర్హులకు సంక్షేమ ఫలాలు అందకూడదన్న జగన్ వారికి నోటీసులు ఇచ్చి అధికారులు రీసర్వే చేసి చర్యలు తీసుకుంటారని తెలిపారు.నోటీసులు ఇస్తేనే పెన్షన్లు తీసేస్తున్నారని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.
ఈ క్రమంలో రీవెరిఫికేషన్ లేకుండా చర్యలు తీసుకోమని సీఎం జగన్ స్పష్టం చేశారు.







