తిరుమల శ్రీవారిని ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దర్శించుకున్నారు.ఉదయం విఐపీ విరామ సమయంలో ఆయన స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించారు.
దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ దావోస్ పర్యటన విజయవంతం కావాలని, రాష్ట్రానికి నూతన పెట్టుబడిదారులను ఆకర్షించే విధంగా పర్యటన సాగాలని ఆయన కోరారు. జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో సాగుతున్న సుపరిపాలన అడ్డుకోవడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నప్పటికీ అవన్నీ నిర్వీర్యమై స్వామి వారి ఆశీస్సులతో రాష్ట్ర అభివృద్ధి జరగాలని శ్రీవారిని ప్రార్థించాను అన్నారు.