ప్రధాని మోడీకి వినతి పత్రం అందించి వీడ్కోలు పలికిన ఏపీ సీఎం జగన్..!!

దాదాపు మూడు రోజుల నుండి ప్రధాని మోడీ తెలుగు రాష్ట్రాలలో పర్యటించడం తెలిసిందే.

జులై రెండు మూడు తారీకులలో తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో పాల్గొన్నరు.

కాగా జులై 4వ తారీఖు నేడు.అల్లూరి 125వ జయంతి ఉత్సవ వేడుకలకు సంబంధించి భీమవరంలో పాల్గొని బహిరంగ సభలో మోడీ ప్రసంగించడం జరిగింది.

అనంతరం అల్లూరి సీతారామరాజు అతి పెద్ద విగ్రహం ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమం అనంతరం మోడీ భీమవరం నుండి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా గన్నవరం విమానాశ్రయం చేరుకున్నరు.

ఆ తర్వాత  ప్రత్యేక విమానం ద్వారా ఢిల్లీకి బయలుదేరారు.ఈ క్రమంలో ప్రధాని మోడీకి వీడ్కోలు పలుకుతూ సీఎం జగన్ వినతి పత్రం అందించడం జరిగింది.

Advertisement

 గవర్నర్ హరిచందన్ మాత్రం మోడీకి జ్ఞాపికను అందజేశారు.వినతి పత్రం ఇవ్వడంతో మోడీ సీఎం జగన్ తో చాలా సరదాగా సంభాషించటం విశేషం.

కడప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు