1.వందేమాతరం ఎక్స్ ప్రెస్ ప్రారంభించిన మోది
గాంధీనగర్ ముంబై సెంట్రల్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ను గాంధీ నగర్ లో ప్రధాన నరేంద్ర మోది ప్రారంభించారు.
2.కర్ణాటకలోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర
కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలోకి ప్రవేశించింది.
3.ఏపీ టెట్ ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది.
4.నేడు యాదాద్రి కి కేసీఆ
ర్ తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు యాదాద్రిలో పర్యటించనున్నారు.
5.బిగ్ బాస్ షో పై ఏపీ హైకోర్టు ఆగ్రహం
బిగ్ బాస్ షో ను బ్యాన్ చేయాలని ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.
6.టీ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు
నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు నోటీసులు ఇచ్చారు.
7.కెసిఆర్ పై రేవంత్ కామెంట్స్
దేశదిమ్మరిలా తిరగడానికి విమానం కొన్నారంటూ టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ పై ట్విట్టర్ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు.
8.హైదరాబాదులో స్నిడర్ ఫ్యాక్టరీ
ఎలక్ట్రిక్ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన ఫ్రాన్స్ కు చెందిన స్నీడర్ ఎలక్ట్రిక్ కంపెనీ హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది.ఈ మేరకు తెలంగాణ మంత్రి కేటీఆర్ రిమోట్ ద్వారా ఫ్యాక్టరీ శంకుస్థాపనను ప్రారంభించారు.
9.కోర్టుకు హాజరైన ఏపీ డీజీపీ
కర్నూలుకు చెందిన ఒక కేసులో రాష్ట్ర డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి కోర్టుకు హాజరయ్యారు.
10.జనసేన ఆందోళన
బీపీ మండల్ విగ్రహ ఏర్పాటు దిమ్మను తొలగించడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ గుంటూరు జిల్లాలోని ఇన్నర్ రింగురోడ్డు కూడలి వద్ద జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
11.గుడివాడలో టిడిపి రిలే నిరాహారదీక్షలు
ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరు మార్చడం పై గుడివాడలో టిడిపి శ్రేణులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.
12.పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు
హైదరాబాదులోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పంచమ తిధి సందర్భంగా సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
13.బండి సంజయ్ పాదయాత్ర
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ వచ్చే నెల 15 నుంచి 5 విడత ప్రజా సంగ్రామ యాత్రకు సిద్ధమవుతున్నారు.
14.పదవి నుంచి చింతపల్లి ఎంపీపీ తొలగింపు
చింతపల్లి ఎంపీపీ వంతల బాబురావును పదవి నుంచి తొలగించాలని ఉమ్మడి విశాఖ జిల్లా ఎన్నికల అథారిటీ నుంచి ఉత్తర్వులు జారి అయ్యాయి.
15.ఓవైసీ హత్యాయత్నం కేసు యూపీ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు
ఎంఐఎం అధినేత లోక్ సభ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పై జరిగిన హత్యాయత్నం కేసులో నిందితులకు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఓవైసీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
16.టీడీపీ తో పొత్తు ఆలోచన లేదు
ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీతో పొత్తు ఆలోచన బిజెపికి లేదని ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు.
17.దిగ్విజయ్ సింగ్ కామెంట్స్
జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి తాను పోటీ చేయడం లేదని, ఖర్గే కే తాను మద్దతు ఇస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు.
18.ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో కనకదుర్గమ్మ వారు దర్శనం ఇచ్చారు.
19.బూమ్రా స్థానంలో మహమ్మద్ సిరాజ్
మొన్న గాయం కారణంగా టీమిండియా ఫేస్ గన్ బుమ్రా దక్షిణాఫ్రికా తో టి 20 సిరీస్ తో పాటు, టి20 ప్రపంచ కప్ టోర్నీకి దూరమైన నేపథ్యంలో అతడి స్థానంలో హైదరాబాద్ ఫేసర్ మహమ్మద్ సిరాజ్ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది.
20.అమరావతి రైతుల మహాపాదయాత్ర
అమరావతి పరిరక్షణ లక్ష్యంగా రాజధాని ప్రాంత రైతులు మహిళలు చేపట్టిన మహా పాదయాత్ర ఏలూరు జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది.
.