1.బైంసాలో ర్యాలీకి అనుమతి నిరాకరణ పై హైకోర్టు లో విచారణ

బైంసాలు ఆర్ఎస్ఎస్ ర్యాలీకి అనుమతి నిరాకరణ పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది.ఆర్ఎస్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ రూట్ మ్యాప్ ను కోర్టుకు సమర్పించాలని పిటిషనర్ ను కోరింది.
2.కాంగ్రెస్ కు ఎమ్మెల్యే రేగా వార్నింగ్
కాంగ్రెస్ నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని నాలుక చీరేస్తానని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు , ప్రభుత్వ విప్ రేగా కాంతారావు హెచ్చరించారు.
3.వాలంటీర్లపై ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యలు

ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.వాలంటీర్లలో టిడిపి సానుభూతిపరులు ఉంటే తక్షణమే వారిని తొలగిస్తామన్నారు.
4.పోలవరం నిర్మాణం బాధ్యత కేంద్రానిదే
నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వకపోవడం వల్లనే పనులు నత్తడకన సాగుతున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు.పోలవరం నిర్మాణం బాధ్యత కేంద్రాన్ని జనని ఆయన స్పష్టం చేశారు.
5.బొగ్గు స్కాం పై ఈడి సోదాలు

చత్తీస్గడ్ బొగ్గు లెవీ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈరోజు ఉదయం 14 ప్రాంతంలో సోదాలు చేపట్టారు.
6.ఫిల్మ్ ఛాంబర్ కు తారకరత్న పార్థివదేహం
సినీ హీరో నందమూరి తారకరత్న అంత్యక్రియలు ఈరోజు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరగనున్నాయి.మోకిలా నుంచి తారకరత్న పార్థీవ దేహం ఫిలిం ఛాంబర్ కు చేరుకుంది.
7.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.నేడు తిరుమల శ్రీవారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది.
8.ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఫెయిర్
ఎక్సెల్లా లో ఎడ్యుకేషన్ గ్రూప్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ విశాఖలో నోవాటెల్ హోటల్లో జరిగింది.
9.కెసిఆర్ కు బండి సంజయ్ సవాల్

సీఎం కేసీఆర్ కు బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు.డేట్ టైం ఫిక్స్ చెయ్ నేను రెడీ అంటూ ఛాలెంజ్ చేశారు.
10.సోము వీర రాజు పై మల్లాది విష్ణు ఫైర్

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కు పిచ్చి పట్టిందని ,కన్నా లక్ష్మీనారాయణ దెబ్బకి ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడంలేదని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు.
11.స్వామివారికి వసంతోత్సవం
శ్రీ సత్య సాయి జిల్లా లేపాక్షి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామివారికి వసంతోత్సవం జరగనుంది.
12.పోలవరం ప్రాజెక్టు పరిశీలన యాత్ర
నేడు సిపిఐ రాష్ట్ర నాయకత్వంలో పోలవరం ప్రాజెక్టు పరిశీలన యాత్ర ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది.
13.ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు

విశాఖలో నీటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతున్నాయి.
14.ప్రాంతీయ ఉద్యమాల అంశంపై సెమినార్
ఒంగోలులోని ఆంధ్ర కేసరి యూనివర్సిటీలో ప్రాంతీయ వాదం, దక్షిణ భారతదేశంలో ప్రాంతీయ ఉద్యమాలు అనే అంశం పై సెమినార్ జరుగుతుంది.
15.వైసీపీ ఎమ్మెల్సి అభ్యర్థుల ప్రకటన

త్వరలో జరగనున్న ఎంఎల్సి ఎన్నికలకు అభ్యర్ధులను వైసీపీ ప్రకటించింది.
16.అజమ్ ఖాన్ పై జయప్రద కామెంట్స్
సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత అజం ఖాన్ పై మాజీ ఎంపీ జయప్రద విమర్శలు చేశారు.ఇప్పటికే ఆయన చేసిన పనులకు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని అన్నారు.
17.అదాని గ్రూప్ కు రుణాలు కొనసాగుతాయి

అదాని గ్రూప్ నకు రుణాలు కొనసాగుతాయని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ వ్యాఖ్యానించారు.
18.ఎమ్మెల్యే సాయన్న మృతికి నివాళులు
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న భౌతిక గాయానికి ప్రముఖులు నివాళులర్పించారు.
19. 3 రోజుల పాటు ఎంఎంటిఎస్ రైలు రద్దు

సాంకేతిక కారణాలతో మూడు రోజులపాటు 33 ఎంఎంటిఎస్ రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
20.చీటింగ్ కేసులు సంధ్య కన్వెన్షన్ ఎండి అరెస్ట్
సంధ్య కన్వెన్షన్ ఎండి శరణాల శ్రీధర్రావును ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.అమితాబచ్చన్ బంధువుల మోసం చేసిన కేసులో ఈ అరెస్ట్ జరిగింది.