1.కవితకు ఈడి నోటీసులు
ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడి అధికారులు నోటీసులు జారీ చేశారు.
2.గాంధీజీ హత్య కేసులో బీజేపీ పాత్ర : ఎర్రబెల్లి

మహాత్మా గాంధీ హత్య కేసులో బిజెపి పాత్ర ఉన్నట్లు అనుమానంగా ఉందని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
3.స్విగ్గి బాయ్ దాడిలో గాయపడిన చెఫ్ మృతి
స్విగ్గి బాయ్ దాడిలో గాయపడిన ఆదిత్య మృతి చెందాడు.
ఫుడ్ డెలివరీ ఆలస్యం కావడంతో డెలివరీ బాయ్ తో గొడవకు దిగాడు.ఈ నేపథ్యంలో డెలివరీ బాయ్ ఆదిత్య పై కత్తి తో దాడి చేయగా ఈ ఘటన లో ఆదిత్య చికిత్స పొందుతూ మృతి చెందాడు.గచ్చిబౌలి లో ఈ ఘటన చోటు చేసుకుంది.
4.కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిరసన దీక్ష

భూ నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమరెడ్డి వెంకట్ రెడ్డి 72 గంటల నిరసన దీక్షకు దిగనున్నట్లు ప్రకటించారు.
5.భారత్ లో కరోనా
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 6,422 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
6.విజయవాడకు సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ విజయవాడ కు వెళ్ళనున్నారు.అక్టోబర్ 14 నుంచి 18 వరకు విజయవాడ కేంద్రంగా జరగనున్న సిపిఐ జాతీయ మహాసభలలో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు.
7.అంబేద్కర్ యూనివర్సిటీ కోర్సుల్లో ప్రవేశాలకు 30 వరకు గడువు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అందించే వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 30 వరకు గడువును పొడిగించారు.
8.సైబరాబాద్ పరిధిలో మరో 12 పోలీస్ స్టేషన్ లు

సైబరాబాద్ పరిధిలో మరో కొత్త పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు.
9.సిద్దిపేటలో క్యాత్ ల్యాబ్ గుండె చికిత్సలు
రాబోయే రోజుల్లో సిద్దిపేటలో 15 కోట్లతో క్లాత్ గుండె చికిత్సలు అందిస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు.
10.కోకాపేట సెజ్ కు కొత్తగా నాలుగు బస్సులు

ఐటీ ఉద్యోగులు ప్రయాణికుల సౌకర్యార్థం 156 కే రూట్ లలో దిల్షుక్ నగర్ నుంచి కోకాపేట సెజ్ వరకు కొత్తగా నాలుగు మెట్రో బస్సు సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.
11.భద్రాద్రి రామయ్య హుండీ లెక్కింపు
భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు నిర్వహించారు.రూ.86,02,047 ఆదాయం వచ్చింది.
12.19 నుంచి పిజి ఈసెట్ కౌన్సిలింగ్

ఎం ఈ ఎంటెక్ ఎంఫార్మ్ సీ, ఫార్మ్ డి , ఎం ఆర్కిటెక్చర్ కోర్సులు ప్రవేశాలకు ఉద్దేశించిన పేజీ ఈసెట్ కౌన్సిలింగ్ ఈనెల 19 నుంచి ప్రారంభమవుతున్నట్లు ఉన్నత విద్యా మండలి అధ్యక్షుడు ఆచార్య లింబద్రి.తెలిపారు.
13.తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాల ప్రదానం
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం 2019 ప్రతిభా పురస్కారాలను ప్రధానం చేశారు.మొత్తం 12 మందికి ఈ పురస్కారాలు అందించారు.
14.గోవా సీఎల్పి బీజేపీ లో విలీనం

గోవా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీని అధికార బిజెపి అంగీకరిస్తున్నట్లు గోవా అసెంబ్లీ స్పీకర్ తవాడ్కర్ తెలిపారు.
15.ఆప్ గుర్తింపు రద్దు చేయాలి
ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి మాజీ బ్యురోకట్లు లేఖ రాశారు.
16.డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది దీనికోసం ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేశారు.
17.ప్రధానిపై కేటీఆర్ కామెంట్స్
ఇండియన్ కరెన్సీ పైన కూడా ప్రధాని నరేంద్ర మోదీ బొమ్మ ముద్రిస్తారిమోనని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.
18.సోనాలి పోగాట్ హత్య కేసు విచారణ

బిజెపి నాయకురాలు సోనాలి పొగాట్ మృతి పై ఎట్టకేలకు సిబిఐ విచారణ ప్రారంభించింది.
19.రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్
సీనియర్ ఆటగాడు రాబిన్ ఊతప్ప అన్ని ఫార్మాట్ ల నుంచి తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.
20.ఈ రోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 45,800 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 59,960
.







