News Roundup: న్యూస్ రౌండప్ టాప్ 20

1.టీడీపీ నేత బుద్దా వెంకన్న అరెస్ట్

Telugu Apcm, Bandi Sanjay, Cm Kcr, Corona, Indian League, Jagga Reddy, Mlc Kavit

టీడీపీ నేత బుద్దా వెంకన్న ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.జయహో బీసీ నేపథ్యంలో బయటకు వెళ్ళ వద్దని సూచించారు. 

2.తాడిపత్రి లో జేసీ ప్రభాకర్ రెడ్డి ర్యాలీ

  తాడిపత్రి మున్సిపల్ ఆపీసుకు జేసీ ప్రభాకర్ రెడ్డి ర్యాలీగా బయల్దేరి వెళ్లగా , పోలీసులు అడ్డుకున్నారు.దీంతో పోలీసులు, జేసీ వర్గీయులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 

3.తుఫాను గా బలపడనున్న వాయుగుండం

 

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold-TeluguStop.com

Telugu Apcm, Bandi Sanjay, Cm Kcr, Corona, Indian League, Jagga Reddy, Mlc Kavit

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం కారై కాల్ కు తూర్పు ఆగ్నేయం గా 770 కి.మి చెన్నై కి దూరంలో కేంద్రీకృతం అయ్యింది.ఈ ప్రభావం ఏపీలో అనేక జిల్లాల్లో కనిపించనుంది . 

4.పురంధరేశ్వరి కామెంట్స్

  బీసీ కార్పొరేషన్ పేరుతో కులాల మధ్యన చిచ్చు పెట్టారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధరేశ్వరి విమర్శించారు. 

5.ఉద్రిక్తంగా మారిన సీపీఐ చలో రాజ్ భవన్

 

Telugu Apcm, Bandi Sanjay, Cm Kcr, Corona, Indian League, Jagga Reddy, Mlc Kavit

ఖైరతాబాద్ చౌరస్తలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.పోలీసులకు, సీపీఐ నేతలకు మధ్య తోపులాట జరిగింది. 

6.మల్లిఖార్జున ఖర్గే ను కలుస్తా : జగ్గారెడ్డి

  కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు మల్లికార్జున కర్గేను కలుస్తానని కాంగ్రెస్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. 

7.జగిత్యాల నుంచి టీఆర్ఎస్ జైత్ర యాత్ర

 

Telugu Apcm, Bandi Sanjay, Cm Kcr, Corona, Indian League, Jagga Reddy, Mlc Kavit

జగిత్యాల నుంచే టీఆర్ఎస్ జైత్ర యాత్ర మొదలవుతుంది అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. 

8.ఇండియన్ రేసింగ్ లీగ్

  హైదరాబాద్ నగరంలో మరోసారి కార్ రేసింగ్ ఈ నెల 9 న ఉదయం 11 గంటల నుంచి 11 సాయంత్రం వరకు ఎన్టీఆర్ మార్గ్ లో ఇండియన్ రేసింగ్ లీగ్ జరగనుంది. 

9.సింగరేణి ని ప్రవేటు పరం చేస్తే ఉద్యోగులు నష్టపోతారు

 

Telugu Apcm, Bandi Sanjay, Cm Kcr, Corona, Indian League, Jagga Reddy, Mlc Kavit

సింగరేణి ని ప్రవేటు పరం చేస్తే ఉద్యోగులు నష్టపోతారు అని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. 

10.సిట్ నివేదిక లీక్ పై హైకోర్టులో వాదనలు

  ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దాఖలు చేసిన కౌంటర్ లీక్ కావడం పై తెలంగాణ హై కోర్టు లో వాదనలు జరిగాయి. 

11.ఎన్నారై మెడికల్ కాలేజ్ వ్యవహారం పై ఈడి ప్రకటన

 

Telugu Apcm, Bandi Sanjay, Cm Kcr, Corona, Indian League, Jagga Reddy, Mlc Kavit

ఎన్నారై మెడికల్ కాలేజ్ సోదాలకు సంబందించి ఈడి ప్రకటన చేసింది.ఈ సోదాల్లో మొత్తం 53 చోట్ల స్థిరాస్తుల ను ఈడి గుర్తించింది. 

12.బండి సంజయ్ కామెంట్స్

  దేశమంతా కేసీఆర్ కుటుంబాన్ని చూసి అసహ్యించుకుంటుందని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. 

13.రేవంత్ రెడ్డి కామెంట్స్

 

Telugu Apcm, Bandi Sanjay, Cm Kcr, Corona, Indian League, Jagga Reddy, Mlc Kavit

గ్రామ రెవెన్యూ వ్యవస్థకు వీఆర్ఏలు పట్టుకొమ్మలని, వారితో గొడ్డు చాకిరీ చేయిస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. 

14.నోట్ల రద్దు పై సుప్రీం లో ముగిసిన విచారణ

  నోట్ల రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై నేడు సుప్రీం కోర్టు లో విచారణ ముగిసింది.తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ఐదుగురు సభ్యుల ధర్మాసనం పేర్కొంది. 

15.వైసిపి పాలనలో బీసీలకు అన్యాయం

 

Telugu Apcm, Bandi Sanjay, Cm Kcr, Corona, Indian League, Jagga Reddy, Mlc Kavit

వైసీపీ కాలంలో బీసీలకు అన్యాయం జరిగిందని రాష్ట్రవ్యాప్తంగా టిడిపి నిరసనలు చేపట్టి, అన్ని జిల్లాల కలెక్టరేట్లలో వినతిపత్రం సమర్పించారు. 

16.దేవినేని అవినాష్ నివాసంలో ముగిసిన సోదాలు

  వైసీపీ కీలక నేత దేవినేని అవినాష్ నివాసంలో ఐటీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 

17.తిరుమల సమాచారం

 

Telugu Apcm, Bandi Sanjay, Cm Kcr, Corona, Indian League, Jagga Reddy, Mlc Kavit

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.నేడు ఒక్క కంపార్ట్మెంట్ లో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. 

18.ఎమ్మెల్యే రాజా సింగ్ కు నోటీసులు

  బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు మరోసారి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ కు ఆయన కామెంట్ చేసిన నేపథ్యంలో ఈ నోటీసులు జారీ చేశారు. 

19.ఐ ఎం ఐ తెలంగాణ కు ఐదుగురు సలహాదారులు

 

Telugu Apcm, Bandi Sanjay, Cm Kcr, Corona, Indian League, Jagga Reddy, Mlc Kavit

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర విభాగానికి సలహా దారులుగా ఐదుగురు ప్రముఖులను నియమించినట్లు ఐ ఎం ఐ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బీ ఎన్ రావు తెలిపారు. 

20.పుస్తక ప్రదర్శన అనుమతి కోసం

  ఈ నెల 22 నుంచి జనవరి 1 వరకు తెలంగాణ కళాభారతి స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన పుస్తక ప్రదర్శన కు అనుమతి కోసం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరి గౌరశంకర్ కలిసి  వినతి పత్రం అందజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube