సర్జికల్ స్ట్రైక్ పై కేసీఆర్ సర్టిఫికెట్ బీజేపీకి అవసరం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.
నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేని సీఎం మనకు వద్దని తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి వైయస్ షర్మిల విమర్శించారు.
అస్సాం సీఎం హిమంత్ బిస్వా పై హైదరాబాద్ లో కేసు నమోదయ్యింది.కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పై అస్సాం సీఎం విమర్శలు చేయడం పై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదైంది.
తెలంగాణలో వెంటనే ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ టిఎస్పి కార్యాలయం ముందు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల దీక్షకు దిగారు.
హజ్ యాత్రకు వెళ్లే వారు దరఖాస్తు చేసుకునేందుకు మంగళవారం వరకు అనుమతి ఉందని హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షఫీ ఉల్లా అన్నారు.
81వ అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శనను ఈనెల 25 నుంచి ప్రారంభించనున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ గౌరవ కార్యదర్శి ఆదిత్య మార్గం తెలిపారు.
సీనియర్ జర్నలిస్ట్, కవి, శ్రీ యార్లగడ్డ రాఘవేంద్ర రావు కు ఉమ్మడిశెట్టి సత్య దేవి సాహితీ అవార్డు లభించింది.
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రకటించిన స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2021 కి ఈసారి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందాయి.
వెస్ట్ జోన్ ఐజీగా వెయిటింగ్ లో ఉన్న సీనియర్ ఐపిఎస్ అధికారి వీబీ కమల్ హాసన్ రెడ్డి నియమితులయ్యారు.
గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 614 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ప్రధాని పదవికి కనీస గౌరవం ఇవ్వకుండా నరేంద్ర మోది పై తెలంగాణ సీఎం కేసీఆర్ నోరు పారేసుకోవడం సరికాదని హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శించారు.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన అర్బన్ అధారిటీ లకు కమిటీలు , దాని పరిధి లోని గ్రామాలను ఎంపిక చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ పేరిట చేనేత కళాకారులకు రాష్ట్రస్థాయి అవార్డు లను అందించాలని నిర్ణయించిందని చేనేత , జౌళి శాఖ ఏడి వెంకటేశం తెలిపారు.
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బదిలీ వేటు పడింది.ఆయనను జి.ఎ.డి లో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
హంద్రీనీవా కాలువ పై ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆందోళనకు దిగారు.రైతులతో కలిసి ఆయన ఈ ఆందోళన చేపట్టారు.
ఏపీ లోని రైతుల ఖాతాల్లోకి ఇన్పుట్ సబ్సిడీ ని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది.
ఏపీ జెన్ కో ఉద్యోగుల సహాయ నిరాకరణ కార్యక్రమం వాయిదా పడింది.
ఏపీ డీజీపీగా కసిరెడ్డి రాజేందర్ రెడ్డి ని నిర్మించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
నేటి నుంచి టీటీడీ సర్వదర్శనం టోకెన్ లను ఆఫ్ లైన్ లో జారీ చేయనుంది.
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 46,800 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 51,050.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy