1.కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై హైకోర్టు విచారణ
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ హైకోర్టులో విచారణ వాయిదా పడింది.మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని కోరుతూ 40 మంది రైతులు కోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు.
2.ఐటి ఇండస్ట్రీస్ ప్రతినిధులతో కేటీఆర్ ముఖాముఖి
ఐటీ ఇండస్ట్రీస్ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ ముఖాముఖిగా మాట్లాడారు.2023 లో టీ ఫైబర్ నెట్ ద్వారా ఇంటర్నెట్ అందించనున్నట్లు కేటీఆర్ తెలిపారు.
3.విజయశాంతి కామెంట్స్
బిజెపి తెలంగాణ నాయకత్వంపై ఆ పార్టీ నాయకురాలు విజయశాంతి ట్వీట్ చేశారు .బిజెపి తెలంగాణ అధ్యక్షుడు మార్పు ఉండదని క్లారిటీ ఇచ్చారు.
4.విద్య వైద్య రంగాన్ని జాతీయం చేయాలి
విద్య వైద్య రంగాన్ని జాతీయం చేయాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
5.టి ఎస్ ఆర్ టి సి కొత్త వ్యాపారం
తెలంగాణ ఆర్టీసీ కొత్త వ్యాపారాన్ని నేడు ప్రారంభించింది.ఆర్టిసి ఆధ్వర్యంలో ప్రయాణికులకు జీవా మంచినీటి బాటిల్స్ ను నేటి నుంచి అమ్మకానికి అందుబాటులోకి తీసుకువచ్చింది.
6.ప్రతిపక్షాలపై సజ్జల కామెంట్స్
ప్రతిపక్షాలన్నీ కలవడం మంచిదేనని , అందరిని ఒకేసారి ఓడిస్తామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
7.తెలంగాణకు ప్రధాని మోదీ
ఈనెల 19 తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోది రాబోతున్నారు.చిన్నపాటి సభను ఏర్పాటు చేస్తున్నారు.
8.తిరుమల సమాచారం
తిరుమలలో నేడు 300 దర్శనం టికెట్లను విడుదల చేయనున్నారు.ఈనెల 12 నుంచి 31 వరకు సర్వదర్శన టిక్కెట్లు జారీ చేయనున్నారు.
9.నేడు శ్రీశైలం లో పుదుచ్చేరి సీఎం
నేడు పుదుచ్చేరి సీఎం ఎన్ రంగస్వామి శ్రీశైలం రానున్నారు.
10.ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు పర్యటన
ఉమ్మడి అనంతపురం జిల్లాలో నేటి నుంచి రెండు రోజులపాటు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రద్దరాజు పర్యటించనున్నారు.
11.కాంగ్రెస్ వార్ రూమ్ కేసు
కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో నేడు విచారణకు కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కొనుగోలు హాజరుకానున్నారు.
12.మంత్రి హరీష్ రావు పర్యటన
నేడు మెదక్ జిల్లాలో మంత్రి హరీష్ పర్యటిస్తున్నారు.తుఫాన్ లోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
13.నేడు కాంగ్రెస్ ధర్నా
నేడు ఇందిరాపార్క్ దగ్గర కాంగ్రెస్ ధర్నా చేపట్టింది.సర్పంచ్ ల సమస్యలపై ఈ ధర్నాను నిర్వహిస్తున్నారు.
14.కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వ్యవహారం
కామారెడ్డి లో నేడు 49 మంది కౌన్సిలర్లకు రైతులు వినతి పత్రాలు ఇవ్వమనున్నారు.మాస్టర్ ప్లాన్ రద్దుకు తీర్మానం చేయాలని బాధిత రైతులు కోరనున్నారు.
15.చందా కొచ్చర్ అరెస్టు అక్రమమే
ఐసిఐసిఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ కు బాంబే హైకోర్టులో ఊరట లభించింది.వీరిని జైలు నుంచి విడుదల చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.చట్టానికి అనుగుణంగా దంపతులు అరెస్టు జరగలేదని కోర్టు అభిప్రాయబడింది.
16.మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు గృహనిర్బంధం
టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు నిర్వహించ తలపెట్టిన పాదయాత్ర పై పోలీసులు ఆంక్షలు విధించారు.ఆయనకు గృహ నిర్బంధం విధించారు.
17.ఆస్తుల పంపిణీ పై ఏపీ ప్రభుత్వం పిటిషన్
రాష్ట్ర విభజన తర్వాత ఆస్తులు పంపిణీ పై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
18.వారసుడు రిలీజ్ వాయిదా : దిల్ రాజు ప్రకటన
విజయ్ హీరోగా నటించిన వారసుడు విడుదలను వాయిదా వేస్తున్నట్టు నిర్మాత దిల్ రాజు తెలిపారు.
19.12 నుంచి కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్లు
ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు గడువు ముగిసింది .ఈ నెల 12 నుంచి పిలిమినరీ పరీక్ష హాల్ టికెట్లను జారీ చేయనున్నారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 51,600 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 56,290
.