పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన రీఎంట్రీ చిత్రాలతో బాక్సాఫీస్ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.ఇప్పటికే బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ను తెలుగులో ‘వకీల్ సాబ్’ అనే టైటిల్తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు.ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ మూవీని రెడీ చేస్తున్నాడు పవన్.
దర్శకుడు క్రిష్ డైరెక్షన్లో పవన్ తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు.ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్గా ప్రారంభించారు.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై మాత్రం స్పష్టత రాలేదు.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫర్నాండెజ్ను హీరోయిన్గా తీసుకునేందుకు చిత్ర యూనిట్ ఆసక్తిగా ఉందంటూ వార్తలు వినిపించాయి.
కానీ దర్శకుడు క్రిష్ మాత్రం బాలీవుడ్ అందాలకు నో అంటున్నాడు.
ఈ సినిమాలో స్వీటీ అనుష్కను తీసుకోవాలని భావిస్తున్నాడట.
గతంలో క్రిష్ తెరకెక్కించిన వేదం చిత్రంలో అనుష్క ఓ వేశ్య పాత్రలో నటించింది.దీంతో ఇప్పుడు మరోసారి ఆమెను హీరోయిన్గా తీసుకోవాలని చూస్తున్నాడట క్రిష్.
మరి పవన్ సరసన అనుష్క నటిస్తుందా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.