నిశ్శబ్ధం పరిస్థితి ఏమిటి.. అనుష్కను పట్టించుకునే వారు లేరా?

టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి నటిస్తున్న లేటెస్ట్ మూవీ నిశ్శబ్ధం ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.

కానీ కరోనా వైరస్ కారణంగా నెలకొన్న లాక్‌డౌన్‌తో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.అయితే ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి ఏమాత్రం కనిపించకపోవడంతో ఈ సినిమా రిలీజ్ అయోమయంలో పడింది.

అయితే ఈ సినిమా రిలీజ్‌పై ఇటీవల చిత్ర నిర్మాత కోన వెంకట్ ఓ క్లారిటీ ఇచ్చారు.ఒకవేళ థియేటర్లు తెరుచుకుంటే సినిమాను రిలీజ్ చేస్తామని, లేకపోతే ఓటీటీలో చేయాల్సి వస్తుందని ఆయన అన్నారు.

దీంతో ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తారని అందరూ అనుకున్నారు.కానీ నిశ్శబ్దం సినిమా సైలెంట్ అయిపోవడంతో, ఈ సినిమాను రిలీజ్ చేస్తారా లేదా అనే సందేహం అందరిలో నెలకొంది.

Advertisement

ఒకవేళ ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తే అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించకపోవచ్చు అనే అనుమానం చిత్ర యూనిట్‌లో నెలకొందని తెలుస్తోంది.అందుకే వారు ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారట.

ఇక ఈ సినిమాలో అనుష్క మూగ, చెవిటి అమ్మాయిగా నటిస్తుండగా మాధవన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.అందాల భామ షాలిని పాండే, అంజలి కూడా ఈ సినిమాలో నటిస్తుండగా, ఇప్పటికే రిలీజ్ అయిన చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి.

మరి నిశ్శబ్దం చిత్ర రిలీజ్‌పై ఈ నిశ్శబ్దం ఎప్పుడు తొలిగిపోతుందో తెలియాలంటే చిత్ర యూనిట్ అఫీషియల్ క్లారిటీ ఇచ్చే వరకు ఆగాల్సిందే.

ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను.. సోనమ్ కపూర్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

Advertisement

తాజా వార్తలు