అనుపమ పరమేశ్వరన్( Anupama Parameswaran )… పాన్ ఇండియా హీరోయిన్ గా, ప్రస్తుతం ఎంతో క్రేజ్ ఉన్న నటిగా, సోషల్ మీడియాలో సైతం మంచి ఫాలోయింగ్ ఉన్న అనుపమ ప్రస్తుతం తెలుగులో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా చేయడం లేదు అంటే నమ్ముతారా .? మలయాళీ ప్రేమమ్( Premam ) సినిమా ద్వారా వెండితెరకు మొదటిసారి పరిచయమైన అనుపమ అ ఆ సినిమాతో తెలుగు తెలుగు పరిచయమయ్యింది.హీరోయిన్ గా అవతారం అయితే ఎనిమిదేళ్లయినా కూడా ఆమె తెలుగులో ఎనిమిది అంటే కేవలం ఎనిమిది సినిమాల్లో మాత్రమే కనిపించింది.అందులో ఐదు సినిమాలు ఒక 2022వ సంవత్సరంలోనే వచ్చాయి.
అంతకుముందు అ ఆ, శతమానం భవతి, రాక్షసుడు సినిమాల్లో మాత్రమే నటించింది అనుపమ పరమేశ్వరన్.
నిజానికి చాలామంది హీరోయిన్స్ సోషల్ మీడియా పాపులారిటీ అనుపమ సొంతం.ఆమె పాపులారిటీ చూసి మిగతా హీరోయిన్స్ సైతం కుళ్ళుకోవాల్సిందే.పైగా కార్తికేయ( Karthikeya ) సీక్వెల్ సినిమాతో ఆమె పాన్ ఇండియాస్ తారగా ఎదిగింది.
ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో ఆమెకు తెలుగులో వరుస పెట్టి అవకాశాలు వస్తాయని అందరూ భావించారు.కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆమె ఒక్క సినిమా కూడా ఒప్పుకోకపోవడం విశేషం.
కారణాలు ఏమైనా కూడా ఆమెకు బాలీవుడ్ మీడియా లో మాత్రం మంచి సానుభూతి లభిస్తుంది.అనుపమలాంటి క్యూట్ హీరోయిన్ ఎందుకు స్టార్ హీరోయిన్ కాలేక పోతుంది అంటూ సోషల్ మీడియాలో కూడా కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
హీరోయిన్ రోల్ కాకుండా అంటే సుందరానికి సినిమాలో స్పెషల్ రోల్ లో కూడా నటించింది అనుపమ.మరోవైపు డి జే టిల్లు సీక్వెల్ సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయినప్పటికీ హీరో సిద్దు జొన్నలగడ్డ( siddu jonnalagadda ) ప్రవర్తన నచ్చకపోవడంతో ఆ సినిమా నుంచి తనకు తానుగా బయటకు వచ్చింది.ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ చేతిలో రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి.సైరన్ అనే ఒక తమిళ సినిమా మరియు మలయాళ సినిమాలో కనిపిస్తుంది.మరోవైపు కమర్షియల్ సినిమాల్లో ఆమె కనిపించకపోవడానికి ఆమె ఎక్కువగా ట్రెడిషనల్ పాత్రలు ధరించడం కూడా ఒక కారణం.అలాగే తెలుగింటి ఆడపడుచులా కనిపించే అమ్మాయితో ఎక్స్పోజింగ్ కూడా చేయించే అవకాశాలు లేకపోవడంతో కొంతమంది తెలుగు దర్శకులు ఆమెను పక్కన పెడుతున్నట్టుగా తెలుస్తోంది.