దిల్ రాజు మేనల్లుడుతో రొమాన్స్ కి రెడీ అయిన అనుపమ

ప్రేమమ్ సినిమాతో తెరంగేట్రం చేసి తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అఆ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్.

మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకొని టాలీవుడ్ లో కుర్ర హీరోలకి ఫస్ట్ ఛాయస్ గా మారిపోయిన అనుపమ పరమేశ్వరన్ ని తరువాత ఎక్కువగా ఫ్లాప్ లు పలకరించాయి.

శతమానం భవతి సినిమా తర్వాత ఆమెకి అనుకున్న స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చే సినిమా ఒక్కటి కూడా పడలేదు.చివరిగా తెలుగులో ఆమె బెల్లంకొండ శ్రీనివాస్ కి జోడీగా రాక్షసుడు అనే సినిమాలో నటించింది.

ఈ సినిమా హిట్ అయిన కూడా అనుపమ పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతొ మరో సినిమా అవకాశం కోసం ఆశగా ఎదురుచూస్తుంది.నార్త్ హీరోయిన్స్ తరహాలో అందాల ప్రదర్శన చేయడానికి ఆమె రెడీగా లేకపోవడంతో పాటు గ్లామర్ పాత్రలు పెద్దగా ఈ అమ్మడుకి రావడం లేదు.

అలా అని తెలుగులో హీరోయిన్ ప్రాధాన్యత చిత్రాలు అంటే చాలా తక్కువగా ఉన్నాయి.వాటికి ఇప్పుడు సాయి పల్లవి, రష్మిక, పూజా హెగ్డే లాంటి భామలు పోటీగా ఉన్నారు.

Advertisement

అందుకే దర్శకులు ఈ ముగ్గురు తర్వాతనే నాలుగో ఛాయస్ కి వెళ్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా అనుపమ పరమేశ్వరన్ దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

గతంలో రామ్ కి జోడీగా హలో గురు ప్రేమకోసమే సినిమాలో నటించిన ఈ భామ ఇప్పుడు దిల్ రాజు మేనల్లుడు ఆశీష్ రెడ్డి హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు.ఈ సినిమాలో అతనికి జోడీగా అనుపమని దర్శకుడు ఫైనల్ చేసాడు.

ఈ సినిమా హుషారు ఫేం శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కుతుంది.మరి ఈ సినిమాతో అయిన అనుపమ ఫేట్ మారుతుందేమో చూడాలి.

Nutmeg Helps To Lose Weight After Delivery Nutmeg, Lose Weight, Delivery, After Delivery, Latest
Advertisement

తాజా వార్తలు