'దుబాయ్'కి ప్రయాణమైన మరో స్టార్ కపుల్..!

బిజీ బిజీగా సాగే జీవితానికి కొందరు బ్రేక్ ఇచ్చి సరదాగా ట్రిప్ లకు వెల్లి అలా సేదతీరుతూ ఉంటారు.

అయితే ఎప్పుడూ బీజీ బిజీగా గడిపే సినీ స్టార్స్ కూడా అప్పుడప్పుడూ తమ ఫ్యామిలీతో సరదాగా గడపానికి ప్లాన్స్ చేసుకుంటూ ఉంటారు.

అందుకోసం ఎక్కడైతే బాగుంటుందోనని ఆలోచించుకుని వెలుతుంటారు. అందరిని ఆకట్టుకుంటున్న ప్లేస్ కూడా ఒకటుందండోయ్.

ప్రస్తుతం మన స్టార్స్ అందరూ అక్కడికే హాలీడే ట్రిప్ గా వెళ్లి ఎంజాయ్ చేసి వస్తున్నారు.మరి ఆ టూరిస్ట్ ప్లేసేంటో తెలుసా.

అదేనండి ప్రసిద్ద టూరిస్ట్ ప్లేస్ గా పేరు గాంచిన దుబాయ్.అక్కడున్న ప్రత్యేకతలలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జబెల్ అలి పోర్ట్.

Advertisement

దీనిని ప్రపంచంలోనే మనుషులతో నిర్మించబడిన అతిపెద్ద పోర్ట్ అని కూడా చెప్పుకోవచ్చు.అంతేకాదండోయ్ దుబాయ్ కంప్యూటర్, మీడియా, సమాచార రంగాలలో అభివృద్ధి చెందిన నగరంగా పేరు గాంచింది.

ఈ మధ్యకాలంలో సినీ తారలందరూ ట్రిప్ లో భాగంగా దుబాయ్ బాట పడుతుండటం విషేశం.అయితే ఆ మధ్యన సూపర్ స్టార్ మహేశ్ బాబు కుటుంబ సమేతంగా విహార యాత్రకని దుబాయికి వెళ్లి ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే.

అలాగే మన జూనియర్ ఎన్టీఆర్ కూడా తన సతీమణీ, పిల్లలతో దుబాయి వెళ్లి జాలీగా వెళ్లి వచ్చారు.వీరితో పాటుగా మెగాస్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసన కూడా పర్యాటక ప్లేస్ గా దుబాయికి వెళ్లి ఎంజాయ్ చేశారంటూ వార్తలు కూడా వినిపించాయి.ఇలా స్టార్స్ అందరూ దుబాయి వెళ్లి ఎంజాయ్ చేసేస్తున్నారు.

వీరే కాకుండా అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగచైతన్య, సమంతలు కూడా మాల్దీవులకు వెళ్లి ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తున్నారు.కాగా మరో జంట కూడా పర్యటనలో భాగంగా దుబాయిలో ఎంజాయ్ చేయడానికి సిద్ధమయ్యారట.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

వారెవరో కాదండోయ్.రీసెంట్ గా పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడైన నితీన్.

Advertisement

వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపుతున్న నితీన్ తన సినిమాలకు కొంచెం బ్రేక్ వేసి హాలిడే ట్రిప్ ను ఎంజాయ్ చేయడానికి సిద్ధమయ్యాడు.నితీన్ తన భార్య తో కలిసి దుబాయ్ వెళ్లాడు.

అయితే నితీన్ హనిమూన్ కు ఇటలీ వెళ్తున్నాడని వార్తలు కూడా వచ్చాయి.కాని ఏమైందో ఏమో కాని హనిమూన్ కి బదులుగా ట్రిప్ కు దుబాయ్ వెళ్లి అక్కడ వారం రోజుల పాటు ఎంజాయ్ చేయడానికి వెళ్లాడు.

కాని ఏమటకామాటే దుబాయ్ పర్యాటక స్థలంగా అందరినీ ఆకట్టుకుంటోంది.

తాజా వార్తలు