తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి( BRS ) మరో షాక్ తగిలింది.బీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు.
తాజాగా జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్( Zaheerabad MP BB Patil ) కారు దిగి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.పార్టీ పెద్దలు తరుణ్ చుగ్ సమక్షంలో ఆయన బీజేపీలో( BJP ) చేరారు.
కాగా నిన్న నాగర్ కర్నూల్ ఎంపీ రాములు బీజేపీ గూటికి చేరిన సంగతి తెలిసిందే.గత నెలలో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత కాంగ్రెస్ లోకి చేరారు.ఒక్కొక్కరిగా నేతలంతా బీఆర్ఎస్ ను వీడటం పార్టీకి పెద్ద షాక్ అనే తెలుస్తోంది.