విజయవాడలో సంకల్ప సిద్ధి తరహాలో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది.అభరణాల పేరుతో గోల్డ్ స్కీమ్స్ అంటూ కొందరు కేటుగాళ్లు భారీగా డబ్బులు వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది.
నెల రోజులుగా ఆఫీస్ తీయకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.మా డబ్బుతో మీరు బంగారం కొనండి అంటూ సంస్థ ప్రకటనలు చేసినట్లు సమాచారం.
స్కీమ్స్ పేరుతో నెలవారి డబ్బులు వసూళ్లు చేసిన సంస్థ బోర్డు తిప్పేసిందని బాధితులు ఆరోపిస్తున్నారు.రంగంలోకి దిగిన పోలీసులు ఘటనపై విచారణ చేస్తున్నారని సమాచారం.