తిరుమల ఆలయం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై పలు విమర్శలు వస్తున్నాయి.ఆలయ పట్టణంలోని సేవా టిక్కెట్లు మరియు గదుల అద్దెల ధరలు కూడా పెంచేశారు.
దీనిని హిందూ సంఘాలు తీవ్రంగా ఖండించిన విషయం కూడా తెలిసిందే.అయితే ఇప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
అహోబిలం మఠం సమస్యకు సంబంధించి, మతపరమైన సంస్థల విషయాల్లో వారిని అసలు జోక్యం చేసుకోవద్దని, ఆలయ నిర్వాహకులనే ఈ సమస్యను పరిష్కరించుకునేలా అవకాశం ఇవ్వాలని సుప్రీం కోర్టు ప్రభుత్వానికి సూచించింది.
ఇకపోతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానం కూడా సమర్థించింది.వివరాల్లోకి వెళితే, అహోబిలం మఠానికి కార్యనిర్వహణాధికారిని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.అయితే ఈ అంశాన్ని హైకోర్టులో సవాలు చేశారు.
ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు చీఫ్ ఆఫీసర్గా ఎవరిని నియమించాలో నిర్ణయించే అధికారం మఠానికి ఉందని పేర్కొంది.హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టింది.
మఠం కార్యనిర్వాహక అధికారిని నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఎస్కే కౌల్, ఏఎస్ ఓకాతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పినదానికి మద్దతు ఇస్తూ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియామకంలో మతపరమైన వ్యక్తులను అనుమతించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది.“మతవాదులను దీనిని నిర్వహించనివ్వండి.ఆర్టికల్ 136 (సుప్రీంకోర్టు ద్వారా అప్పీల్ చేయడానికి ప్రత్యేక అనుమతి) కింద ప్రతి కేసులో మేము చట్టాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నించాల్సిన అవసరం లేదు,” అని ధర్మాసనం వాదనల సమయంలో పేర్కొంది.
మొదట జీవో1, ఇప్పుడు అలయాల విషయంలో కూడా ముందు హై కోర్టులో, తర్వాత సుప్రీం కోర్టులో వరుస దెబ్బలు తగలడంతో జగన్ ప్రభుత్వానికి ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తుంది అనే చెప్పాలి.!
.