ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకుండా చేసిందని వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడుతున్నారు.దేశంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెబుతున్నారు.
ఇదంతా వైఎస్సార్సీ పాలన వల్లననే టీడీపీ అధ్యక్షుడు అంటున్నారు.తన జీవితంలో ఇలాంటి పార్టీని చూడలేదని వ్యాఖ్యానించారు.
తెనాలికి చెందిన వైఎస్సార్సీపీ నేత గుడిబండ గోవర్ధన్రెడ్డిని టీడీపీలోకి స్వాగతించి చంద్రబాబు.ఏపీ అభివృద్ధికి అమరావతి, పోలవరం చాలా ముఖ్యమైన ప్రాజెక్టులు.
గత టీడీపీ హయాంలో హైదరాబాద్ తరహాలో అమరావతి అభివృద్ధికి చర్యలు చేపట్టిందని చంద్రబాబు చెబుతున్నారు.అయితే మూడు రాజధానులను అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనతో వైఎస్సార్సీ ప్రభుత్వం అమరావతి అభివృద్ధిని పక్కనబెట్టిందని అన్నారు.
గత హయాంలో పోలవరం ప్రాజెక్టు 72 శాతం పూర్తయిందని చెబుతున్నారు.వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి పురోగతి లేదని టీడీపీ అధ్యక్షుడు మండిపడ్డారు.
పోలవరం ప్రాజెక్టు ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీని మార్చడం వల్ల దాని పురోగతికి ఆటంకం కలుగుతుందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్రం హెచ్చరించినా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వినలేదని నారా చంద్రబాబు నాయిడు ఆరోపించారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పుడు ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టమ్ను ప్రవేశపెట్టి ఉపాధ్యాయులను వేధించడం ప్రారంభించిందని టీడీపీ అధ్యక్ష్యడు చంద్ర బాబు ఎత్తిచూపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తమ సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారని గొప్పలు చెప్పుకుంటున్నాఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రైతు సంతోషంగా లేడని టీడీపీ అధినేత అన్నారు.హిందూపురం వైఎస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో కాల్ను ప్రస్తావిస్తూ, అది అసలైనదని రుజువైనప్పటికీ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వైఎస్సార్సీపీ ప్రభుత్వం సిగ్గుచేటని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెబుతున్నారు.
వైసీపీ ప్రభుత్వం పాలన వలనే అని సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్ అవుతున్నారు.







