ఆ విషయం పై ఆవేదన వ్యక్తం చేస్తున్న రష్మీ..!

బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న యాంకర్ రష్మి గౌతమ్.రష్మీ కి సామాజిక స్ఫూర్తి చాలా ఎక్కువ.

జంతువులను హింసించడం, తినడానికి తిండి లేకుండా అల్లాడిపోతున్న వారిని చూసి రష్మి చాలా బాధ పడుతున్న సంఘటనలు మనం ఇదివరకే చూశాం.మూగజీవాలు అంటే రష్మి కి చాలా ఇష్టం.

వాటికి ఏవైనా సమస్యలు తలెత్తితే అసలు సహించలేదు.ఇకపోతే తాజాగా రష్మీ కి ఒక ఒక ఏనుగును హింసిస్తున్న సంఘటనను చూసి చాలా బాధవేసింది.

ఇక వెంటనే రష్మి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేస్తూ ఇప్పటికైనా జంతువులను హింసించడం మానుకోండి.అంటూ రేష్మి తెలియచేసింది.

Advertisement

అంతేకాకుండా మూగజీవాలపై స్వారీలు చేయడం మనకు సరదాగా ఉంటుంది కానీ, ఆ మూగజీవాలు ఎంత ఇబ్బంది, నరకయాతన అనుభవిస్తాయో అన్న విషయం మనం గ్రహించలేకపోతున్నాం అంటూ రష్మి తన ఆవేదనను వ్యక్తం చేసింది.ఇక ఏనుగుపై సవారి చేసే సమయంలో మావటి వాడు పదునైన కత్తితో దానిపై గుచ్చుతాడు.

ఆ సమయంలో ఏనుగు ఎంత బాధ అనుభవిస్తుందో అది వర్ణించ దగ్గ విషయం కాదనే చెప్పాలి.

ఇక ఆ ఈ ఏనుగు ఆయుధం వల్ల ఎలాంటి ఇబ్బందులు పడతాయో గాయపడతాయో అన్న అంశాన్ని వివరిస్తూ ఒక ఫోటో రూపంలో తెలియజేసింది రష్మీ.ఈ ఫోటోను తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఆ పోస్టుకు " ఏనుగుపై స్వారీలు చేయడం సర్కస్ లో మూగజీవాల తో ఆటలు ఆడించడం.మనకు ఆనందాన్ని కలిగిస్తుంది ఏమో కానీ ఆ మూగజీవాలు ఎంత ఇబ్బంది పడుతున్నాయో అన్న విషయం పట్టించుకోవడం లేదు.

సర్కస్ అనేది మనకు సంతోషాన్ని ఇస్తుంది కానీ, ఆ మూగజీవాలకు కొండంత బాధను మిగిల్చిందని రష్మి వాపోయింది.కాబట్టి ఇప్పటికైనా జంతువులను హింసించడం మానండి " అంటూ రష్మి చెప్పుకొచ్చింది.

పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు