తెలుగు బుల్లితెరపై యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ(Anasuya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇలా అనసూయ బుల్లితెరపై జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తూ అనంతరం వెండితెర అవకాశాలను కూడా అందుకున్నారు.
ఇలా ప్రస్తుతం వెండితెర పై వరస సినిమా అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్నా అనసూయ జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించే సమయంలో తన వస్త్రధారణ కారణంగా ఎన్నోసార్లు విమర్శలను ఎదుర్కొంది.ఇలా ఈ విమర్శల కారణంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఈమె పెద్ద ఎత్తున గొడవకు కూడా దిగారు.

ఇలా తన గురించి తన వస్త్రధారణ గురించి ట్రోల్ చేసిన వారి పట్ల పోలీసులకు కూడా ఫిర్యాదు చేసే వరకు కూడా వెళ్లారు.ఇలా ఎప్పుడు సోషల్ మీడియాలో (Social media)యాక్టివ్ గా ఉంటూ తనని విమర్శించే వారికి తనదైన స్టైల్ లో అనసూయ సమాధానం చెబుతూ ఉంటారు.ఈ క్రమంలోనే తాజాగా అనసూయ మరోసారి సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు.ఈ వీడియో కనుక చూస్తే అనసూయ చాలా ఫ్రస్టేషన్లో ఉందని అర్థం అవుతుంది.

ఇంస్టాగ్రామ్(Instagram ) వేదికగా అనసూయ ఒక వీడియోని షేర్ చేస్తూ మహిళలు పిల్లల్ని కనమని, కనొద్దని… జాబ్ చేయాలని చెయ్యొద్దని… లావుగా ఉండాలని కాదు బక్కగా ఉండాలని జడ్జి చేయబడుతున్నారు’ అంటూ అసహనం తెలియజేస్తున్న ఒక వీడియో పోస్ట్ చేశారు.అయితే ఇందులో అన్ని బూతు పదాలతో ఉండడంతో అనసూయ చాలా ఫ్రస్టేషన్లో ఉందని అందుకే ఇలాంటి వీడియో షేర్ చేశారని నేటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.ఇక ఈమె కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరమైనటువంటి అనసూయ సినిమాలో వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు.అయితే బుల్లితెరకు తాను దూరం కావడానికి గల కారణాలను కూడా ఇటీవల ఈమె తెలియజేశారు.
బుల్లితెర కార్యక్రమాలకు రేటింగ్ రావడం కోసం షో నిర్వాహకులు చెత్త పనులు చేస్తున్నారని ఎప్పుడైతే బుల్లితెరపై అలాంటి పనులు చేయరో అప్పుడే తాను తిరిగి బుల్లితెరపై అడుగు పెడతానంటూ ఈమె కామెంట్లు చేశారు.







