అనంతపురం జిల్లాలో విద్యార్థి కిడ్నాప్ ఘటన తీవ్ర కల్లోలం సృష్టించింది.కక్కలపల్లిలో ఇంటర్ విద్యార్థి తేజను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుని వెళ్లారని తెలుస్తోంది.
ఇంటర్ పరీక్ష రాయడానికి వచ్చిన తేజను దుండగులు ఎత్తుకెళ్లారని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.బాధితుని తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ క్రమంలోనే తేజ కోసం విస్తృతంగా గాలిస్తున్నారని సమాచారం.