టాలీవుడ్ సినీ నటుడు, విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ.దొరసాని సినిమా తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు ఆనంద్.
తొలిసారి నటనకే మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆనంద్ ఆ తర్వాత వరుస సినిమాల్లో అవకాశాలు అందుకున్నాడు.ఇదిలా ఉంటే ఆనంద్ సైలెంట్ గా మరో సినిమా మొదలు పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక హీరోయిన్ గా నటించిన దొరసాని సినిమా తో తన నటన జీవితాన్ని పరిచయం చేశాడు ఆనంద్.ఈ సినిమా మంచి సక్సెస్ ను అందుకోగా ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాల్లో నటించాడు.
ఈ సినిమా ఓటీటీ ద్వారా విడుదల అయిన సంగతి తెలిసిందే.అయినా కూడా ఈ సినిమా మంచి గుర్తింపు అందుకుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత డెబ్యూ దామోదర్ దర్శకత్వంలో పుష్పక విమానం చేస్తున్నట్లు గతంలోనే తెలిపాడు ఆనంద్.
ఇక ఈ సినిమా విడుదల కాకముందే మరో నాలుగో సినిమా సైలెంట్ గా మొదలు పెట్టాడు ఆనంద్ దేవరకొండ.సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ దర్శకత్వంలో ఆనంద్ ఓ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా టైటిల్ హైవే అని కూడా పెట్టారని తెలిసింది.
ఈ సినిమాను వెంకట్ తలారి నిర్మిస్తున్నారు.ఈ సినిమా సైకో కిల్లర్ తరహా క్రైమ్ థ్రిల్లర్ అని తెలుస్తుంది.
ఈ సినిమా రోడ్ జర్నీ నేపథ్యంలో తెరకెక్కనుంది.ఇక ఈ సినిమాను తాజాగా ఆఫీస్ లో లాంఛనంగా ప్రారంభించారు.
ఇక ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం కరోనా వైరస్ అని పట్టించుకోకుండా షూటింగ్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు సినీ బృందం.