ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం కనిపించింది.మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా ఒకే వేదికపై కలిశారు.
గుడివాడలో వైసీపీ నేత కుమార్తె వివాహం కొడాని నాని ఫంక్షన్ హాల్ లో జరుగుతుంది.ఈ నేపథ్యంలో వివాహనికి వచ్చిన వంగవీటి రాధాను స్వయంగా కొడాలి నాని లోపలికి తీసుకెళ్లారు.
అనంతరం ఇద్దరు ప్రత్యేకంగా చర్చించుకున్నారు.కలిసి నూతన దంపతులను ఆశీర్వదించారు.
అయితే ఇద్దరు కీలక నేతల కలయిక కృష్ణా జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.