తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ అమృత రావు( Amrita Rao ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అమృత రావు తెలుగులో మహేష్ బాబు ( Mahesh Babu )హీరోగా నటించిన అతిథి సినిమాలో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.
తెలుగులో ఈ ఒకే ఒక సినిమాలో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.ఇక ఈ సినిమాకు ముందు ఆ తర్వాత హిందీలో చాలా సినిమాలలో నటించిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే అమృతరావు తన జీవితంలో జరిగిన పలు సంఘటనల గురించి కపుల్ ఆఫ్ థింగ్స్ అనే పుస్తకంలో రాసుకొచ్చిన విషయం తెలిసిందే.
అందులో తన మేనేజర్ చేసిన మోసాన్ని ప్రస్తావించింది.ఈ సందర్భంగా ఆమె ఆ విషయం గురించి ప్రస్తావిస్తూ.అప్పుడు నేను మహేశ్ బాబు తో సినిమా చేస్తున్నాను.
షూటింగ్ కోసం హైదరాబాద్లో ఉన్నాను.అయితే ఒకరోజు సాయంత్రం తాజ్ బంజారా హోటల్లో బోనీ కపూర్( Boney Kapoor) తో పనిచేసిన వ్యక్తిని చూశాను.
అతడు నన్ను చూడగానే హాయ్ అమృతా అంటూ దగ్గరకు వచ్చి పలకరించాడు.తర్వాత నీకు డేట్స్ సర్దుబాటు అయ్యుంటే మాతో పాటు సల్మాన్ ఖాన్ వాంటెడ్ షూటింగ్లో ఉండేదానివి అన్నాడు.
ఆ మాటకు నేను షాక్ అయ్యాను.అసలు వాంటెడ్ కోసం నన్నెప్పుడు అడిగారని తిరిగి అతన్ని ప్రశ్నించాను.అప్పుడు అతను అలా అంటావేంటి? వాంటెడ్ కోసం నిన్నే సంప్రదించాము.నీ మేనేజర్కు కూడా ఫోన్ చేశాం.
కానీ అతను నీ డేట్స్ సర్దుబాటు చేయడం కష్టమని చెప్పాడు అని తెలిపాడు అని అతను చెప్పడంతో ఆ మాట విని ఆమె గుండె ముక్కలైందట.అంత పెద్ద ఆఫర్ వచ్చిందీ అన్న విషయాన్నీ మేనేజర్ నాకు చెప్పనేలేదు.
నన్ను మోసం చేశాడు.అంత మంచి ఆఫర్ నాదాకా వస్తే నేనెందుకు మిస్ చేసుకుంటాను.
కచ్చితంగా డేట్స్ ఇచ్చేదాన్ని.అతను స్వతాహాగా నా దగ్గర ఉద్యోగం మానేయడానికి బదులు నేనే అతడిని వెళ్లగొట్టేలా చేశాడు.
కానీ ఇలా వాంటెడ్ ఛాన్స్ మిస్ చేసి.మర్చిపోలేని బాధను గిఫ్ట్ ఇచ్చాడు అని రాసుకొచ్చింది అమృత.