నేడు తెలంగాణలో అమిత్ షా పర్యటన.. మ్యానిఫెస్టో విడుదల

బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు.ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించే సభలకు హాజరుకానున్నారు.

ముందుగా మధ్యాహ్నం 12 గంటలకు అమిత్ షా బేగంపేట ఎయిర్ పోర్టుకు రానున్నారు.అక్కడి నుంచి నేరుగా గద్వాల్ కు వెళ్లనున్న ఆయన మధ్యాహ్నం ఒంటి గంటకు బీజేపీ సకల జనుల సంకల్ప సభకు హాజరుకానున్నారు.తరువాత మధ్యాహ్నం 2.55 గంటలకు నల్గొండలో నిర్వహించే సభలో పాల్గొననున్నారు.సాయంత్రం 4.25 గంటలకు వరంగల్ లోని సభకు అమిత్ షా హాజరవుతారు.వరంగల్ సభ ముగిసిన అనంతరం హైదరాబాద్ కు రానున్నారు.ఈ క్రమంలోనే సాయంత్రం 6.10 గంటలకు బీజేపీ మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు.తరువాత ఎమ్మార్పీఎస్ నేతలతో షా సమావేశం అవుతారు.

ఫ్యూచర్ లో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ ముగ్గురి మీదనే ఆధారపడి ఉందా..?

తాజా వార్తలు