అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు త్వరలో మధ్యంతర ఎన్నికల ను ఎదుర్కోబోతున్నారు.ఇప్పటికి వరకూ తాను అందించిన పాలన ఎలా ఉంది అనేది ఈ ఎన్నికలలో తేలిపోతుంది.
ఒక పక్కరష్యాకు ఎదురు వెళ్తూ ఉక్రెయిన్ కు మద్దతు ఇస్తూ కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెడుతున్న బిడెన్, మరో పక్క ట్రంప్ వేస్తున్న రాజకీయ ఎత్తుగడలను ఎదుర్కుంటూ ఈ మధ్యంతర ఎన్నికలలో తన సత్తాని పరీక్షించుకోబోతున్నారు.ఈ ఎన్నికల్లో బిడెన్ తన సత్తా నిలబెట్టుకోగలరా లేదా అనేది త్వరలో తేలిపోనుంది.
ఇంతవరకూ బాగానే ఉన్నా అసలు ఉన్న పళంగా ఈ మధ్యంతర ఎన్నికలు ఎందుకనంటే.
రెండేళ్లకు ఒకసారి మధ్యంతర ఎన్నికలు జరగటం అక్కడి సాంప్రదాయం.
ఈ ఎన్నికల్లో అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో గవర్నర్లు ,చట్టసభలు, స్థానిక సంస్థలు, సెనేట్, ప్రతినిధుల సభతో పాటు అన్ని ఈ మధ్యంతర ఎన్నికలకు వెళ్తాయి.కాగా సెనేట్ లో మాత్రం 100 లో మూడో వంతు అంటే 35 సీట్లకు మాత్రమే ఎన్నికలు జరుగుతాయి.
అలాగే ప్రతినిధుల సభలో 435 మంది సభ్యులను ఈమధ్యంతలో ఎన్నికల్లోనే ఎన్నుకుంటారు.ఈ మధ్యంతరం ఎన్నికలు ఎందుకు నిర్వహించాల్సి వస్తోందంటే.అధ్యక్షుడు ఈ రెండేళ్ళ పాలన ఎలా ఉంది, ప్రజలు అధ్యక్షుడి పాలనపై సంతృప్తిగా ఉన్నారా లేదా అనేది తేలిపోతుంది.మరీ ముఖ్యంగా ప్రతినిధుల సభ గడువు కేవలం రెండేళ్ళు మాత్రమే ఉంటుంది.
సెనేట్ మాత్రం 6 ఏళ్ళు ఉంటుంది.

ప్రస్తుతం ఈ ఎన్నికల్లో విజయంపై ఎవరికి వారు ధీమాను వ్యక్తం చేస్తున్నారు.బిడెన్ పాలనపై ప్రజలు తీవ్ర నిరాశతో ఉన్నారని రిపబ్లికన్ పార్టీ, కాదు కాదు ట్రంప్ పై తీవ్ర వ్యతిరేకత ఉంది కాబట్టి ప్రజలు తమ పార్టీకే పట్టం కడతారని డెమోక్రాటిక్ పార్టీలు బల్ల గుద్దిమరీ చెప్తున్నాయి.ముఖ్యంగా చెప్పాలంటే ఈ మధ్యంతర ఎన్నికలు బిడెన్ పాలనపై ప్రజల నుంచీ తీసుకునే అభిప్రాయ సేకరణ అనే చెప్పాలి.