అమరావతి రైతులు దేశ రాజధాని ఢిల్లీకి పయనం కానున్నారు.ఈనెల మూడో వారంలో హస్తినకు వెళ్లనున్న రైతులు అక్కడ ఆందోళనలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం.
ఢిల్లీలో మొత్తం మూడు రోజులపాటు నిరసన కార్యక్రమం చేపట్టాలని రైతులు ప్రణాళికను రూపొందించారు.ఈ నేపథ్యంలో విజయవాడ నుంచి ప్రత్యేక రైలులో హస్తినకు రైతులు వెళ్లనున్నారు.